జగన్ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్‌ను మించిపోతారు : గాలి

0
41

ఏపీ శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ చేయనున్న వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన తండ్రి వైఎస్ఆర్‌ను మించిపోతారని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఏపీ ఎన్నికల ఫలితాలపై గాలి స్పందిస్తూ, ఈ ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మరోమారు ఘన విజయాన్ని అందుకుని రెండోసారి అధికారంలోకి రావడం కూడా ఆయన హర్షించారు. ఇందుకోసం కర్నూలు జిల్లాలోని మంత్రాలయం చేరుకుని రాఘవేంద్రస్వామికి మొక్కులు సమర్పించుకున్నారు.

స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గాలి మాట్లాడుతూ.. ఏపీ సీఎంగా జగన్ తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నానని తెలిపారు. అద్భుత పాలనతో చరిత్రలో గొప్ప సీఎంగా నిలిచిపోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడంతో రాఘవేంద్రస్వామికి మొక్కులు సమర్పించుకున్నట్టు తెలిపారు.