పసుపు కుంకుమ తీసుకున్నారు.. నవరత్నాల వైపే మొగ్గు

0
34

సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ సర్కారు పసుపు కుంకుమ పేరుతో ఇచ్చిన డబ్బును మహిళలు తీసుకున్నారు. కానీ, వైకాపా అధినేత జగన్ ప్రకటించిన నవరత్నాలపైనే వారి చూపుపడింది. ఫలితంగా శాసనసభ ఎన్నికల్లో సైకిల్‌ను కాదని ఫ్యాను గుర్తుకు ఓటు వేశారు. దీంతో వైకాపా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.

నిజానికి సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలకంగా నిలిచారు. ఓటర్లలో పురుషుల కంటే స్త్రీల సంఖ్య కాస్త తక్కువైనా.. ఓటింగ్‌ చైతన్యంలో వారే ముందంజలో నిలిచారు. ఫలితాలపై ప్రభావం చూపారు. వైసీపీకి మద్దతుగా అధికశాతం మంది ఓటేసి.. ఆ పార్టీని ఆదరించారు.

డ్వాక్రా మహిళలకు అందజేసిన ‘పసుపు-కుంకుమ’ టీడీపీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ శ్రేణులు భావించినా.. మగువల మనసు మారి.. వైసీపీ ప్రకటించిన ‘నవరత్నాలు’ వైపు మొగ్గుచూపారు. ఫలితంగా జగన్ సునామీలో టీడీపీ అభ్యర్థులు కొట్టుకునిపోయారు.