మాళవికా శర్మపై మనసుపడిన మారుతి

0
44

తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచమయైన హీరోయిన్లలో మాళవికా శర్మ ఒకరు. ఈమె మాస్ హీరో రవితేజ నటించిన నేల టిక్కెట్ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో అడ్డూఅదుపులేకుండా అందాలు ఆరోబోసింది. కానీ, ఈ చిత్రం ఆమెకు పూర్తి నిరాశనే కల్పించింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్‌తో చిత్రలహరి చిత్రంలో నటించింది. ఈ చిత్రం మాత్రం ఆమెకు ఊరట నిచ్చింది. అటు సాయిధరమ్‌కు, ఇటు మాళవికకు లైఫ్ ఇచ్చిన చిత్రలహరి… కలెక్షన్ల పరంగా కూడా బాగానే రాబట్టింది.

ఇదిలావుంటే మాళవికా శర్మపై టాలీవుడ్ దర్శకుడు మారుతి కన్నుపడిందట. సాయిధరమ్ తేజ్‌తో కలిసి ఆయన ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో కూడా మాళవికా శర్మనే తీసుకోవాలని దర్శకుడు ఫిక్స్ అయిపోయాడట. అంటే.. గత వరుస ఫ్లాప్‌ల తర్వాత సాయిధరమ్ చిత్రలవరి చిత్రంతో హిట్ అందుకున్నారు. అలాగే, మాళవికా శర్మ – సాయిధరమ్ కాంబినేషన్ సూపర్బ్ అంటూ ప్రశంసలు వచ్చాయి. ఈ కారణంగానే డైరెక్టర్ మారుతి ఇలా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.