చిత్తుకాగితాలు ఏరుకునే మహిళపై రేప్.. ఎక్కడ?

0
51
rape
rape

తెలంగాణ రాష్ట్రంలోని జనగామలో దారుణం జరిగింది. చిత్తుకాగితాలు ఏరుకునే మహిళపై కొందరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై హత్య కూడా చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జనగామ మండలం, శామీర్ పేట జాతీయ రహదారి పక్కన కల్వర్టు కింద ఓ మహిళ మృతదేహం ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు.

దీంతో పోలీసులు అక్కడకు వచ్చి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. పైగా, మృతదేహంపై గాయాలు ఉండటంతో అత్యాచారం చేసి హత్య చేసివుంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈమె స్థానికంగా చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తూ వస్తోంది. ఈమెకు ఓ కుమార్తెతో పాటు భర్త కూడా ఉన్నాడు. పైగా, సోమవారం అర్థరాత్రి తన తల్లిదండ్రులు ఉండే నెల్లుట్లు నంచి జనగామ బయలుదేరిన ఈ మహిళ.. మంగళవారం ఉదయం హత్యకు గురైనట్టు పోలీసులు వెల్లడించారు.