ఏపీ శాసనసభ ఎన్నికల్లో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి సాధించిన అఖండ విజయం పట్ల తమిళ హీరో సూర్య స్పందించారు. పదేళ్ళ పాటు జగన్ పడిన కష్టానికి, ఆయన ఓర్పుకు దక్కిన విజయంగా చెప్పుకొచ్చారు. సూర్య తాజా చిత్రం “ఎన్.జి.కె.” (నంద గోపాల కృష్ణ). ఈ చిత్రం మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఆయన హైదరాబాద్కు వచ్చారు.
ఈ సందర్భంగా జగన్ విజయంపై స్పందిస్తూ, జగన్ కష్టానికి, ఓర్పుకి దక్కిన ఫలితమన్నారు.”ఇది అపురూప విజయమే. కానీ దాని వెనకాల చాలా కఠోర శ్రమ, అంకుఠిత దీక్ష ఉంది. పదేళ్ల కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది. విజయంతో పాటు సవాళ్లు కూడా ఉన్నాయి.
వాటిని కూడా జయించి మరింత ఉన్నత శిఖరాలకి వెళ్లాలని కోరుకుంటున్నా” అని సూర్య అన్నారు. కాగా, జగన్కు చెందిన భారతీ సిమెంట్స్కు సూర్య బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న విషయం తెల్సిందే. పైగా, జగన్కు చాలా దగ్గరి ఫ్రెండ్. వీరిద్దరి మధ్య చాలా కాలంగా మంచి స్నేహం ఉంది.