తెలుగులో ఓ ఊపు ఊపిన హీరోయిన్లలలో టబు ఒకరు. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన “నిన్నే పెళ్లాడతా” చిత్రంలో ఆమె నటన అద్భుతం. విక్టరీ వెంకటేష్ సరసన నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన టబు.. ఆ తర్వాత అగ్రహీరోలందరితోనూ నటించింది. బాలకృష్ణతో “పాండురంగడు” చిత్రంలో అదిరిపోయేలా ఎక్స్పోజింగ్ చేసింది. ఈ చిత్రంలో ఈ అమ్మడు అందాల ఆరబోతను చూసి కుర్రకారు ప్రేక్షకులు సొంగకార్చుకున్నారు.
ప్రస్తుతం ఈమె వయసు నాలుగు పదులు దాటింది. ఇంకా ముదురు బ్యాచిలర్గానే ఉంది. ఎలాంటి పాత్రలనైనా అవలీలగా చేయగలదు. అవసరమైతే ఏమాత్రం సిగ్గులేకుండా అందాలను ఆరబోయగలదు. ఇపుడు ఈమె చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి.
బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ సరసన భార్యగా నటించింది. అలాగే, టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించే చిత్రంలో ఆంటీ పాత్రలో నటించనుంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా వైవిధ్యమున్న పాత్రలు ధరిస్తూ ఈ అమ్మడు 40 ప్లస్ వయసులోనూ కుర్రకారు హీరోయిన్లకు గట్టిపోటీనిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్కు పినతల్లిగా కూడా నటించింది.