తెలుగులో అతి తక్కువకాలంలో స్టార్ హీరోల సరసన నటించిన నటి కియారా అద్వానీ. మహేష్తో భరత్ అనే నేను, రామ్ చరణ్తో వినయ విదేయ రామ చిత్రంలోనూ నటించింది. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో పడి ప్రస్తుతం డేటింగ్ చేస్తోంది.
అయితే, ఈ వార్తలను ఆమె కొట్టిపారేస్తోంది. కానీ, బాలీవుడ్ మీడియా మాత్రం సిద్ధార్థ్ – కియారాలు డేటింగ్లో ఉన్నారనీ, వేళాపాళా లేకుండా పబ్బుల వెంట తిరుగుతూ రెచ్చిపోతున్నారంటూ కథనాలను ప్రచురిస్తున్నాయి.
తాజాగా వీరిద్దరూ కాంబినేషన్లో ఓ చిత్రం రానుంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోకాగా, ఆయన ప్రియురాలిగా కియారా నటిస్తోంది. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంటే, విష్ణువర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన వీరిద్దరూ ఇపుడు మరింతగా రెచ్చిపోతున్నారట.