కొనసాగుతున్న రాజీనామాల పర్వం : కంభంపాటి గుడ్‌బై

0
49

నవ్యాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారంతా తమతమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు. ఈ పదవికి ఆయన రాజీనామా చేశారు.

ఇదే విషయంపై ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తనను నమ్మి ఆ హోదాలో నియమించిన చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు.. పలు నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారు శనివారం రాజీనామాలు చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య, ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ పదవికి అంబికా కృష్ణా.. వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవికి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తదితరులు తమ రాజీనామాలు సమర్పించారు.