భాగ్యనగరిలో లవ్ జీహాద్..

0
41

హైదరాబాద్ నగరంలో లవ్ జీహాద్ కలకలం సృష్టించింది. ప్రేమ పేరుతో మతమార్పిడికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, కూకట్‌పల్లిలోని ఓ హాస్టల్‌లో ఇందిరా అలియాస్ జుబేరా అనే యువతి నివసిస్తోంది.

హైదరాబాద్ గచ్చిబౌలికి చెందిన రిజ్వాన్ అనే యువకుడు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే, ఇందిరా, రిజ్వాన్‌లు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత రిజ్వాన్‌ను పెళ్ళి చేసుకుంటానంటూ ఇందిరా తల్లిదండ్రులకు కబురుపంపింది. దీంతో తల్లిదండ్రులు నేరుగా హైదరాబాద్‌కు రాగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఇందిర, రిజ్వాన్‌ల‌ వివాహ‌ విషయం తమకు తెలియదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్‌లో బీటెక్‌ చదువుతున్నప్పుడు ఇందిరకు రిజ్వాన్‌తో పరిచయం ఏర్పడింది. పెళ్లి పేరుతో మత మార్పిడి చేశాడని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రిజ్వాన్ బారినుండి తమ కూతురిని అప్పగించాలంటూ వారు పంజాగుట్ట ఏసీపీకి ఫిర్యాదు చేశారు.