మోడీతో డిన్నర్ చేయాలని ఉంది : కత్రినా కైఫ్

0
40

బాలీవుడ్ నటుడు సల్మాన్ – కత్రినా కైఫ్ – దిశా పటానీ కలిసి నటించిన చిత్రం “భరత్”. ఈ చిత్రం ఈ నెల 5వ తేదీన రిలీజ్ కానుంది. ఇందులోభాగంగా, ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

అయితే, ఓ ఆంగ్లమీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కత్రికా కైఫ్ తనదైనశైలిలో సమాధానమిచ్చింది. “మీరు బ్రతికి ఉన్న లేక చనిపోయి వారిలో ఎవరితో డిన్నర్ చేయాలని అనుకుంటున్నారు?” అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కత్రినా కైఫ్ తనదైనశైలిలో బదులిచ్చింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కండోలిజా రైస్, మార్లిన్ మన్రో వంటివారితో డిన్నర్ చేయాలని వుందని ఏమాత్రం తడుముకోకుండా చెప్పింది. ఆ సమయంలో పక్కనే ఉన్న సల్మాన్ ఖాన్ కల్పించుకుని.. ఆ జాబితాలో తాను లేనా అని ప్రశ్నించాడు. దీనికి కత్రినా సమాధానమిస్తూ.. తాను సల్మాన్‌తో కలిసి ఇంతవరకు డిన్నర్ చేయలేదనీ, పైగా, ఆయన డిన్నర్ ఇతరాత్రా పార్టీలకు బయటకురారని తెలిపింది.

ఆ వెంటన్ సల్మాన్ మాట్లాడుతూ కైఫ్ తన డిన్నర్‌ను సాయంత్రం ఆరు గంటలకే ముగించేస్తుందని, ఆ సమయంలో తాను లంచ్ చేస్తుంటానంటూ ఫన్నీ వ్యాఖ్యలు చేశారు. పైగా, లంచ్ లేదా డిన్నర్ ఏదైనా సరే తన కుటుంబ సభ్యులతోనే కలిసి చేయడమే తన అలవాటు అని చెప్పుకొచ్చింది.