కష్టాన్ని నమ్ముకున్నోళ్లు చెడిపోయినట్టు లేరు : రాశీ ఖన్నా

0
55

ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా వరుస సినీ ఆఫర్లు కొట్టేస్తున్న హీరోయిన్లలో రాశీ ఖన్నా ఒకరు. ఈమె తెలుగులోనే కాకుండా, అటు తమిళంలోనూ తెగ బిజీగా ఉంది. తమిళనంలో సిద్ధార్థ్, విజయ్ సేతుపతి వంటి హీరోలతో కలిసి నటిస్తోంది. అలాగే, తెలుగులో విజయ్ దేవరకొండ, నాగచైతన్య వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

అయితే, ఈ అమ్మడు తన సక్సెస్ మంత్రంపై స్పందిస్తూ, ‘కష్టాన్ని నమ్ముకున్నవారు చెడిపోయినట్టు చరిత్రే లేదు. మొదటి నుంచి నేను ఆ సిద్ధాంతాన్ని నమ్మి, కెరీర్‌ బిల్డప్‌ చేసుకున్నాను. ఎప్పుడూ నా రూటు సెపరేటే’ అంటోంది.

పైగా మనల్ని ఇతరులతో పోల్చిచూసుకోరాదు. ఈ విషయాన్ని చిన్నపుడే మా అమ్మ చెప్పింది. ఎవరి సత్తా వారికి ఉంటుంది. కాకపోతే మనల్ని మనం గుర్తించుకోగలగాలి అని నాక్కూడా నిదానంగా అర్థమైందన్నారు.

ఇకపోతే, నేను బరువు తగ్గే విషయంలోనూ వాళ్లూ, వీళ్లూ చెప్పినవి, చేసినవీ చేయలేదు. నిపుణులను సంప్రదించి నా శరీరతత్వానికి సరిపడే వ్యాయామాలనే ఎంపిక చేసుకున్నాను. ‘నేను చేయగలను’ అనే నమ్మకమే నా సక్సెస్‌ మంత్రం. కష్టపడి పనిచేసేవారికి సక్సెస్‌ ఒకరోజు ఆలస్యంగా రావచ్చేమోగానీ, కచ్చితంగా వచ్చి తీరుతుంది. మన కష్టం తాలూకు ప్రతిఫలాన్ని ఎవ్వరూ దోచలేరు అని వేదాంత ధోరణితో చెప్పుకొచ్చింది.