నాకు అంత భాగ్యమా : రష్మిక మందన్నా

0
54

తెలుగు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న భామ రష్మిక మందన్నా. “ఛలో” మూవీతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చినప్పటికీ… “గీత గోవిందం” చిత్రంతో ఎక్కడలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత అమ్మడు నటించిన చిత్రాలు పెద్దగా ఆడకపోయినప్పటికీ.. క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పైగా, వరుస మూవీ ఆఫర్లు వస్తున్నాయి.

ఇప్పటికే “వెంకీమామ”తో పాటు… విజయ్ దేవరకొండ చిత్రాల్లో బుక్ అయింది. హీరో కార్తీ నటించే తమిళ చిత్రాన్ని అంగీకరించింది. ఈ చిత్రంతో ఈమె కోలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. ఇపుడు తమిళ హీరో విజయ్‌తో నటించే చిత్రంలో ఎంపికైనట్టు వార్తలు గుప్పుమన్నారు. ఈ వార్తలపై ఆమె స్పందించింది.

హీరో విజయ్ సరసన తాను నటించడం లేదనీ, అవన్నీ పుకార్లేనని స్పష్టం చేసింది. తనకీ విజయ్‌తో కలిసి నటించాలని ఉంది కానీ ఇప్పటివరకు ఆ సినిమా గురించి ఎవరు తనను సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు పుకార్లు నిజమై ఆ అవకాశం వస్తే తనకంటే సంతోషించేవారు ఇంకెవరు ఉండరని కూడా అంటోందీ భామ. దీంతో ఇలయదళపతితో నటించి శాండల్‌వుడ్‌, టాలీవుడ్‌నే కాదు కోలీవుడ్‌ని కూడా ఏలేయాలనుకుంటుందని అనుకుంటున్నారు సినీజనాలు.