రాజుగారి గది సీక్వెల్ – తమన్నా – నాగార్జున ముద్దూముచ్చట్లు

0
35

అక్కినేని నాగార్జున – కోడి ఓంకార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం “రాజుగారి గది”. ఈ చిత్రం తొలి భాగంలో ఓంకార్ సోదరుడు అశ్విన్ ధన్య బాలకృష్ణన్ జంటగా నటించారు. ఈ చిత్రం సీక్వెల్‌లో మాత్రం నాగార్జున, ఆయన కోడలు సమంత, సీరత్ కపూర్‌లు కీలక పాత్రలు పోషించారు. ఈ రెండు భాగాలు మంచి ప్రేక్షకాధారణ పొందాయి.

అయితే, ఇప్పుడు ‘రాజుగారి గది 3’ కూడా రాబోతుందట. ఇందులో తమన్నా మేజర్‌ రోల్‌ పోషించనుంది. కథ మొత్తం తమన్నా చుట్టూ తిరుగుతుందట. అంటే తన కోడలు సమంతను పక్కనబెట్టి తమన్నాతో నాగార్జున రాజుగారి గదిలో ఏదో చేయబోతున్నారనే ప్రచారం సాగుతోంది.

అదేసమయంలో మొదటి రెండు భాగాల్లో నటించిన ఆర్టిస్టులు ఇందులో కూడా కనిపిస్తారు. కానీ, ఇక్కడో ప్రశ్న ఉత్పన్నమైంది. నాగార్జున ఇపుడు చాలా బిజీగా ఉన్నారు. ఒకవేళ ఆయన బిజీగా ఉంటే మాత్రం మరో నటుడుకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఓంకార్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభించి మూడు నెలల్లో సినిమా పూర్తి చేస్తారని సమాచారం.