అక్కినేని నాగార్జున నటించిన చిత్రం “రక్షకుడు”. అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. తమిళ, తెలుగు భాషల్లో నిర్మించగా, డిజాస్టర్ మూవీగా ముగిలిపోయింది. ఈ చిత్రంలో నాగార్జున సరసన నటించిన భామ సుస్మితా సేన్. మాజీ విశ్వసుందరి. బాలీవుడ్ నటి.
ఈమె తాజాగా ఓ విషయాన్ని వెల్లడించింది. నాలుగేళ్ల క్రితం మరణపుటంచుల వరకు వెళ్లి వచ్చిందట. రెండేళ్ల పాటు స్టెరాయిడ్స్ తీసుకొని బతికిందట. లేదంటే ఈపాటికి కన్నుమూసేదాన్ని అని తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో అసలు విషయం బయటపెట్టింది.
ప్రస్తుతం 40 యేళ్ల ముదురు హీరోయిన్.. ఓ పాపను దత్తత తీసుకుంది. పైగా, వయసులో తనకంటే చాలా చిన్నవాడితో సహజీవనం చేస్తోంది. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా కుర్రోడితోనే కలిసివుంటోంది.
నిజానికి ఒకపుడు తమ అందచందాలతో ప్రేక్షకులను కవ్వించిన అందెగత్తెలు ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఇపుడు కూడా చూస్తున్నాం. ఇటీవలే బాలీవుడ్ సీనియర్ నటీమణులు మనీషా కోయిరాలా, సోనాలి బెంద్రె అనేక మంది అందెగత్తెలు కేన్సర్తో పోరాడి కోలుకున్న విషయం తెల్సిందే.