భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ.. యువకుపై అత్యాచారం…

0
44

కట్టుకున్న భార్యతో ఓ యువకుడు అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని భర్త జీర్ణించుకోలేక పోయాడు. దీంతో తన పగ తీర్చుకునేందుకు ఆ యువకుడుని పట్టుకుని అత్యాచారం చేశాడు. ఇందుకోసం అతని స్నేహితులు కూడా సహకరించారు. ఈ దారుణం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో జరిగింది.

ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ఉచ్చూరుకి చెందిన 26 ఏళ్ల యువకుడు ఓ షోరూమ్ వద్ద నిలబడివుండగా, నాగరాజపురానికి చెందిన దయాకర్‌, బాలచెన్నయ్య, వెంకట్వేర్లు, ఎం మహేష్‌, మస్తాన్‌ అనే యువకులు అక్కడికి వచ్చి, మాటల్లో పెట్టి, ఆటోలో కిడ్నాప్‌ చేశారు.

అతన్ని శివారు ప్రాంతాలకు తీసుకెళ్లి కర్రలతో చితకబాదారు. అప్పటికీ కోపం చల్లారకపోవడంతో అతనిపై అత్యాచారం చేస్తూ, సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ విషయం బయటపెడితే వీడియోలను బహిర్గతం చేస్తామంటూ బెదిరించారు.

ఆ తర్వాత అక్కడ నుంచి బయటపడిన బాధిత యువకుడు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరి భార్యకు, బాధితుడికి వివాహేతర బంధం ఉందని, అందుకు ప్రతీకారంగానే ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు.