దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నచిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లు హీరోగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నార.
అయితే, ఈ సినిమా గురించి బయటకు వచ్చిన ఓ వార్త ఇప్పుడు ఇండియన్ సినిమా వర్గాల్లోనే హాట్ హాట్ ట్రెండింగ్ న్యూస్గా మారింది. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలలో నటిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో ఉన్న అల్యూమినియం కర్మాగారంలో వేసిన సెట్లో నడుస్తోంది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొంటున్నారు.
ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ చాలా గ్రాండ్గా ఉండబోతోందట. ఇంటర్వెల్ బ్యాంగ్లో వచ్చే ఓ ఫైట్ సీన్ కోసం ఏకంగా రెండు నెలల లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారట. ఈ యాక్షన్ సీన్ కోసం 2 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు వర్క్ చేస్తున్నారు. ఈ ఒక్క ఫైట్ కోసమే రాజమౌళి ఏకంగా రూ.45 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్టు సమాచారం.
ఒక్క ఫైట్ లేదా ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు చేయడం ఇండియన్ సినిమా హిస్టరీలో గ్రేట్ రికార్డుగా నిలిచిపోనుంది. రూ.350 కోట్ల పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2020 జులై 30న విడుదల చేస్తున్నట్లు రాజమౌళి గతంలోనే ప్రకటించారు.