తెలుగులో సొట్టబుగ్గల సుందరిగా గుర్తింపు పొందిన హీరోయిన్ తాప్సీ. ఈమెను వెండితెరకు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు పరిచయం చేశారు. ఈమెకు ప్రారంభంలో సక్సెస్ అంత ఈజీగా దొరకలేదు. చాలా కష్టనష్టాలను దాటింది తాప్సీ.
ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా గుర్తింపుపొందింది. ఈ డిల్లీ అమ్మడు కెరీర్లో ఎదిగే క్రమంలో ఎదురైన ఇబ్బందులు గురించి కొన్ని విషయాలను తెలియజేసింది.
“ప్రజలు టికెట్ కొనుక్కుని మమ్మల్ని చూడటానికి వస్తారు. కానీ.. వారితో మేం ఉండటానికి ఇష్టపడరు. నేను నటిగా రాణించాలనుకన్న తరుణంలో ముంబైకి వెళ్లాను. అక్కడ ఇల్లు దొరకడానికి నాకు నెల సమయం పట్టింది. నేను సినిమాల్లో రాణించాలనుకుంటున్నానని తెలియగానే చాలా మంది అద్దెకు ఇల్లు కూడా ఇవ్వలేదని చెప్పింది.
అయితే, హైదరాబాద్ ఇంటి విషయంలో నాకు పెద్దగా సమస్య ఎదురు కాలేదు. డిల్లీ, హైదరాబాద్ ప్రాంతాలు ఆలోచనా విధానంలో ఒకేలా ఉంటాయి. నేను, నా చెల్లెలితో కలిసి ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాను. మా తల్లిదండ్రులు డిల్లీలో ఉంటారని” చెప్పుకొచ్చింది.