3 రోజుల్లో రూ.వంద కోట్ల జోనర్‌లోకి ‘భరత్’

0
50

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, దిశా పటానీలు జంటగా నటించిన చిత్రం భరత్. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. జూన్ 5వ తేదీన విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ టాక్‌ను కొట్టేసింది. ఈ చిత్రం తొలి రోజునే అత్యధిక వసూళ్లను రాబట్టి ఇప్పటికీ విజయవిహారం చేస్తోంది.

ముఖ్యంగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 4,700 థియేటర్లలో విడుదలైంది. తొలిరోజు వసూళ్ల విషయంలో ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ రికార్డును అధికమించింది. తొలిరోజున రూ.42.30 కోట్లను, రెండో రోజున రూ.31 కోట్లు, మూడో రోజున రూ.28 కోట్లు చొప్పున వసూలు చేసింది.

దీంతో కేవలం మూడు రోజుల్లనే ఈ చిత్రం రూ.100 కోట్ల జోనర్‌లో చేరిపోయింది. దీంతో చిత్ర యూనిట్ ఉబ్బితబ్బిబ్బులైపోతోంది. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు హీరో సల్మాన్ ఖాన్ తన ట్విట్టర్ ఖాతాలో ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.