విశాల్‌ చాలా దిగజారిపోయావ్.. నా మద్దతు ఇక నీకు లేదు.. వరలక్ష్మి

0
55

హీరో విశాల్‌కు సీనియర్ నటుడు శరత్ కుమార్‌తో రాజకీయపరమైన విబేధాలున్నాయి. నడిగర్ సంఘం గత ఎన్నికల్లో ఈ విభేదాలు బయటపడ్డాయి. శరత్ కుమార్ కుమార్తె, నటి వరలక్ష్మితో కూడా విశాల్‌కు వ్యక్తిగతమైన సమస్యలున్నాయి. తాజాగా ఈ వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. తాజాగా జరుగుతున్న నడిగర్ సంఘం ఎన్నికల సందర్భంగా అవి కాస్తా బయటపడ్డాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాల్ మరోసారి శరత్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు.

దీనిపై శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడింది. విశాల్‌పై కోపంతో చిందులేసింది. కాస్తో కూస్తో వున్న మర్యాదను కోల్పోయావని చెప్పింది. పోటీలో లేని తన తండ్రిని అనవసరంగా ఎందుకు తిడుతున్నావని వరలక్ష్మి విశాల్‌ని ప్రశ్నించింది. ప్రతీసారీ చట్టం చట్టం అనే విశాల్.. మా తండ్రి తప్పే చేసి వుంటే చట్టం ప్రకారం చర్యలు తీసుకుని వుండాలిగా అంటూ ఎదురుప్రశ్న వేసింది. ఆ చట్టం ప్రకారమే నేరం రుజువుకాని వారు నిర్దోషులు. మా నాన్న తప్పు చేసి ఉంటే ఈపాటికి చట్టం చర్యలు తీసుకుని ఉండేది. అయినా ప్రస్తుత ఎన్నికలతో ఎలాంటి సంబంధంలేని తన తండ్రిని ఎందుకు విమర్శిస్తున్నావ్ అంటూ ప్రశ్నల దాడి చేసింది.

అంతేగాకుండా.. తన పదవీ కాలంలో చేసుకున్న మంచి పనులను ఎత్తిచూపుతూ ఎన్నికల ప్రచారం చేయాలి కానీ.. ఇలాంటి దిగజారుడు పనులు చేయకూడదని హితవు పలికింది. ప్రచారంలో చాలా దిగజారిపోయి ప్రవర్తించావ్. ఇన్నిరోజులు ఒక స్నేహితురాలిగా విశాల్‌కు మద్దతిచ్చారు. ఇకపై తన మద్దతు విశాల్‌కు వుండదని వరలక్ష్మి స్పష్టం చేసింది. వున్న మర్యాదను పోగొట్టుకున్నావంటూ మండిపడింది. ఇకపై వరలక్ష్మి ఓటు విశాల్‌కు లేదంటూ సోషల్ మీడియాలో పెద్ద పోస్టే పెట్టేసింద