దర్శకరత్న దాసరినారాయణరావు పెద్దకుమారుడు ప్రభు కనిపించట్లేది మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కూడా నమోదైందని సమాచారం.
ఐతే కేసు నమోదైన కొన్ని గంటల తరువాత ప్రభు చిత్తూరులోని తన మొదటి భార్యను కలవడానికి ఆయన వెళ్లారని మరొక వార్తలు కొన్ని మాధ్యమాలలో ప్రసారం చేయడం జరిగింది. కానీ నిజంగా చిత్తూర్లో ఉన్నారా లేదా? ఇంతకీ ఆయన ఆచూకీ దొరికిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిన్నటి నుండి ఆయన మిస్సింగ్ మిస్టరీ కొనసాగుతూనే ఉంది.
దాసరికి ఇద్దరు కుమారులు కాగా వారిలో పెద్ద కొడుకు ప్రభు, చిన్న కుమారుడు అరుణ్. జూన్ 9వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రభు ఇప్పటి వరకు మళ్లీ తిరిగి రాలేదు. దాంతో ప్రభు కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేస్ ఫిర్యాదు చేశారు. పదేళ్ల కింద కూడా ఒకసారి ప్రభు ఇలాగే మిస్ అయిపోయాడు. అప్పుడు కూడా 2008లో కొన్ని రోజులు కనిపించకుండా పోయి.. తర్వాత వచ్చి తన భార్య సుశీలే కిడ్నాప్ చేయించిందని సంచలన ఆరోపణలు చేసాడు.
ఈయన చిత్తూర్ జిల్లాకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. ప్రభు తన మొదటి భార్య దగ్గరకి వెళ్లినట్టు పోలీసులు చెబుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దాసరి నారాయణరావు మరణానంతరం ఆస్తి గొడవలు మరింత తీవ్రతరం అయింది. ప్రభుకు చాలా రోజులుగా భార్యతో ఆస్తి తగాదాలు ఉన్నాయి. 1995లో ప్రేమ వివాహం జరిగింది. మొత్తానికి ప్రభు మిస్సింగ్ కేసు మిస్టరీ వీడుతుందో లేదో చూడాలి.