మంచు కొండల్లో మహేష్‌

0
56

‘మహర్షి’తో ఓ మంచి విజయాన్ని అందుకున్నారు మహేష్‌బాబు. ఇప్పుడు ఆయన దృష్టంతా ‘సరిలేరు నీకెవ్వరు’పై ఉంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. రష్మిక కథానాయిక. విజయశాంతి కీలక పాత్రలో కనిపిస్తారు. ఈవారంలోనే కశ్మీర్‌లో చిత్రీకరణ మొదలు కానుంది. మంచు కొండల నేపథ్యంలో కొన్ని సన్నివేశాల్ని  తెరకెక్కిస్తారు. ప్రస్తుతం చిత్రబృందం అక్కడే ఉంది. త్వరలోనే మహేష్‌బాబు కూడా సెట్లో అడుగుపెడతారు. మహేష్‌ ఓ సైనిక అధికారిగా కనిపించనున్నారు. కుటుంబ బంధాల నేపథ్యంలో సాగే కథ ఇది. యాక్షన్‌, వినోదం సమపాళ్లలో మేళవించారు. చాలాకాలం తరవాత విజయశాంతి వెండి తెరపై  కనిపించబోతున్నారు. ఆమె పాత్ర చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. కొన్ని పాటల  రికార్డింగ్‌ పూర్తయింది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.