పస తక్కువ.. ప్రచారం ఎక్కువ: యనమల

0
32

అమరావతి: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల విమర్శలు గుప్పించారు. బడ్జెట్‌లో ప్రచారం ఎక్కువ, పస తక్కువ అని ఎద్దేవా చేశారు. అప్పుల గురించి గత ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు చేశారని.. సుమారు రూ.48వేల కోట్లు అప్పు తెచ్చేందుకు సిద్ధపడ్డారన్నారు. ‘‘వడ్డీలేని రుణాలపై చాలా హడావుడి చేసి రూ.100 కోట్లే కేటాయించారు. సాంఘిక సంక్షేమానికి నిధులు బాగా తగ్గించారు. జలవనరుల శాఖకు రూ.వెయ్యి కోట్ల నిధులు తగ్గించారు. అన్ని పథకాలకు జగన్‌, వైఎస్‌ఆర్‌ పేర్లే పెడుతున్నారు. పేర్లు పెట్టేందుకు రాష్ట్రంలో ఇంకెవరూ నాయకులు లేరా?’’ అని యనమల ప్రశ్నించారు.