మహా సముద్రం’ పేరుతో ఆయనో కథ రాసుకున్నారు

0
42

ఆర్‌ ఎక్స్‌ 100’తో తొలి అడుగులోనే విజయాన్ని అందుకున్నారు అజయ్‌ భూపతి. ఇప్పుడు తన రెండో ప్రాజెక్టు సన్నాహాల్లో బిజీగా ఉన్నారు. ‘మహా సముద్రం’ పేరుతో ఆయనో కథ రాసుకున్నారు. ఇది రవితేజ కోసమే అని సమాచారం. ప్రస్తుతం ‘డిస్కోరాజా’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు రవితేజ. ఆ సినిమా పూర్తయిన తరవాత ‘మహా సముద్రం’ సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఇందులో నాయికగా అదితిరావు హైదరీని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ‘సమ్మోహనం’, ‘అంతరిక్షం’ లాంటి  చిత్రాలతో ఆకట్టుకుంది అదితి. పూర్తిస్థాయి కమర్షియల్‌ చిత్రంలో నటించడం ఇదే తొలిసారి. ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందని, అందుకే గ్లామర్‌తో పాటు అభినయాన్ని ప్రదర్శించ గలిగే అదితిని ఎంచుకున్నారని తెలుస్తోంది.