బర్త్‌డే బార్బీ కత్రినా..ఎన్నో ఆసక్తికర విషయాలు!

0
71

ఆమెను చూస్తే బార్బీ బొమ్మ మనిషి రూపంలో తిరుగుతోందా? అనిపిస్తుంది. మన భాష రాకపోయినా తన అందం, అభినయంతో దాదాపు పదేళ్లకు పైగా ఇండస్ట్రీని ఏలుతోంది. వేరే దేశం నుంచి వచ్చి భారతీయ కుర్రకారు మనసులను దోచుకున్న ‘యువరాణి’.  ఈ కిరీటాలన్నీ మన ‘మల్లీశ్వరి’వే..!  బాలీవుడ్‌లో అగ్రకథానాయికగా రాణిస్తున్న కత్రినా కైఫ్‌ ఈరోజు 36వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు మీకోసం..
* తొలి సినిమా ప్రముఖ దర్శకుడు మహేశ్‌ భట్‌తో చేయాల్సి ఉంది. ఆయన కత్రినాను సినిమాలో తీసుకున్నారు కానీ.. హిందీ మాట్లాడటం రాదని ప్రాజెక్ట్‌ నుంచి తప్పించారు. ఆ తర్వాత 2003లో ‘బూమ్‌’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు.

* అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో కత్రినా ఒకరు. సాధారణంగా ఆ స్థాయిలో ఉన్న సెలబ్రిటీల ఇళ్లు ఇంద్రభవనాల్లా ఉంటాయనుకుంటారు. కానీ కత్రినా ప్రస్తుతం ఉంటున్న ఫ్లాట్‌ చాలా చిన్నగా ఉంటుంది. కత్రినా ఇల్లు చూసినవారంతా ‘ఇంత చిన్నదా..’ అంటూ షాకవుతూ ఉంటారట. అందుకే ఆమె తన ఇంట్లో ఎలాంటి పార్టీలను ఏర్పాటుచేయరు.

* 2015లో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కేన్స్‌ చలన చిత్రోత్సవంలో కత్రినా పాల్గొన్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఇప్పటివరకు కత్రినా ఆ వేడుకకు హాజరుకాలేదు.

* కత్రినాను అందరూ ముద్దుగా ‘క్యాట్‌’ అని పిలుస్తారు. కానీ తనకు అలా పిలవడం నచ్చదని, ఆ పేరు ఎవరు పెట్టారో తెలీదని ఒకానొక సందర్భంలో చెప్పారు.

* కత్రినాకు ఎక్కువగా లండన్‌ వంటకాలంటేనే ఇష్టం.

* 2007లో వచ్చిన ‘వెల్‌కమ్‌’ చిత్రంలో కత్రినా ఓ వెండి రంగు గౌనును ధరించారు. దాని ధర సుమారు రూ.2లక్షలు. ప్రముఖ ఇటాలియన్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ ఎమీలియో పుచ్చీ ఆ గౌనును కత్రినాకు కానుకగా ఇచ్చారు.

* కత్రినా, దీపికా పదుకొణె ఒకప్పుడు రణ్‌బీర్‌ కపూర్‌తో డేటింగ్‌ చేశారని టాక్‌. దాంతో కత్రినా, దీపికల మధ్య విరోధం ఉందని బాలీవుడ్‌ వర్గాల టాక్‌. కానీ దీపిక, రణ్‌వీర్‌ సింగ్‌ల వివాహ విందుకు కత్రినా రావడమే కాదు.. పార్టీ అయిపోయేంత వరకు అక్కడే ఉండి వారితో ఎంజాయ్‌ చేశారు.

* కత్రినా చదరంగం బాగా ఆడతారు. పెయింటింగ్‌ అన్నా ఇష్టమే. ఆమిర్‌ ఖాన్‌ ఎప్పుడు చెస్‌ ఆడినా కత్రినానే తన పార్ట్‌నర్‌గా ఎంచుకుంటారు.

* ప్రకటనలకు కత్రినా రూ.5 కోట్లు పారితోషికం తీసుకుంటారట.

* ఈ బార్బీ బొమ్మకు చీకటంటే చాలా భయం.

* కాజోల్‌, మాధురీ దీక్షిత్‌లకు కత్రినా వీరాభిమాని.

* 2011, 2013లో కత్రినా మెస్ట్‌ సెర్చ్‌డ్‌ సెలబ్రిటీగా నిలిచారు.

* బాలీవుడ్‌లో బాగా పాపులర్‌ అయిన ఖాన్స్‌ (షారుక్‌, సల్మాన్‌, ఆమిర్, సైఫ్‌‌)లతో కలిసి కత్రినా నటించారు.

* మ్యాటెల్‌ ఇండియా అనే టాయ్‌ కంపెనీ కత్రినాను పోలి ఉండే బార్బీ బొమ్మను రూపొందించింది. ఈ ఘనత సాధించిన తొలి బాలీవుడ్‌ సెలబ్రిటీ కత్రినానే కావడం విశేషం.

* కత్రినా రెండు తెలుగు సినిమాల్లో (మల్లీశ్వరి, అల్లరి పిడుగు), ఒక మలయాళం చిత్రంలో (బలరాం వర్సెస్‌ తారాదాస్‌) చిత్రాల్లో నటించారు.

* కత్రినా అక్షయ్‌కుమార్‌కు జోడీగా దాదాపు ఆరు చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ఏడో చిత్రంగా ‘సూర్యవంశీ’ తెరకెక్కుతోంది.

* ఆమెకు ఇండియాలో ఎలాంటి ఆస్తులు లేవు. ఇప్పటికీ ముంబయిలోని బాంద్రాలో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు.

* ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం ‘మల్లీశ్వరి’. ఈ సినిమాకు కత్రినా తీసుకున్న పారితోషికం దాదాపు రూ.75 లక్షలు. అప్పట్లో అంతటి పారితోషికం తీసుకున్న ఏకైక నటి ఆమే.

* తన తల్లికి చెందిన ఓ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ తరఫున కత్రినా సామాజిక సేవలు చేస్తుంటారు. ఈ ట్రస్ట్‌ ద్వారా అనాథ ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తున్నారు.

* తన సినిమా విడుదల అవుతోందంటే తప్పకుండా ముంబయిలోని సిద్ధివినాయక ఆలయాన్ని, మౌంట్‌ మేరీ చర్చికి, అజ్మేర్‌ దర్గాకు వెళుతుంటారు.

* కత్రినా ఎప్పుడూ స్కూల్‌కి వెళ్లిందిలేదట. కొన్ని కారణాల వల్ల ఇంట్లోనే తన తల్లి ప్రైవేట్‌ ట్యూషన్‌ను పెట్టించారట.

* కత్రినా అసలు పేరు కత్రినా టుర్కోట్‌. కానీ ఆ పేరు పలకడం కష్టంగా ఉందని జాకీ ష్రాఫ్‌ భార్య ఆయేషా ఆమె పేరులోని టుర్కోట్‌ పదాన్ని తీసేసి కైఫ్‌ అని పెట్టారు.

* ఇండస్ట్రీలో కత్రినాకు సల్మాన్ ఎంతో సాయం చేశారు. 2011లో కత్రినా, సల్మాన్‌ డేటింగ్‌ చేశారు. ‘సల్మాన్‌తోనే నా తొలి ప్రేమ. తనతో సీరియస్‌ రిలేషన్‌ షిప్‌లో ఉన్నా’ అని ఒకప్పుడు కత్రినా స్వయంగా చెప్పారు.