తమిళ నిర్మాతల మండలిలో పూరి జగన్నాథ్‌పై ఫిర్యాదు

0
50

పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ఇటీవలే విడుదలైంది. అయితే ఈ చిత్ర కథ తాను రూపొందించిన ‘నాన్‌ యార్‌’ అనే తమిళ చిత్రాన్ని పోలి ఉందంటున్నారు నటుడు ఆకాష్‌. సోమవారం ఆయన హైదరాబాద్‌లో పాత్రికేయులతో మాట్లాడారు. ‘‘నేను కథ, స్క్రీన్‌ప్లే అందించిన చిత్రం ‘నాన్‌ యార్‌’. రాధ దర్శకుడు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘కొత్తగా ఉన్నాడు’ పేరుతో అనువదించాం. త్వరలో విడుదల చేద్దామనుకుంటున్న తరుణంలో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చూసి ఆశ్చర్యపోయా. నా కథకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఈ విషయమై తమిళ నిర్మాతల మండలిలో పూరి జగన్నాథ్‌పై ఫిర్యాదు చేశా. సమస్య పరిష్కారం కాకపోతే న్యాయ పోరాటం చేస్తాన’’న్నారు