ముంబయి: ‘కబీర్ సింగ్’ సక్సెస్తో మంచి ఫాంలో ఉన్నారు సినీ నటి కియారా అడ్వాణీ. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎన్ని వివాదాలు ఎదుర్కొందో అంతకంటే రెట్టింపు వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.300 కోట్లకుపైగా వసూళ్ల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో కియారా ఈ వివాదాల గురించి, బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో వస్తున్న ఎఫైర్ వార్తల గురించి ఓ మీడియా ద్వారా స్పందించారు.
‘సిద్ధార్థ్తో డేటింగ్లో ఉన్నానని వార్తలు వస్తున్నాయి. అందులో ఎంత మాత్రం నిజం లేదు. నేను సింగిల్గానే ఉన్నాను. కానీ కచ్చితంగా నేను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను’ అన్నారు. అనంతరం ‘కబీర్ సింగ్’లో హీరో, హీరోయిన్లు ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం గురించి మాట్లాడుతూ.. ‘అలా కొట్టుకోవడం, నోటికొచ్చినట్లు తిట్టుకోవడం నాక్కూడా నచ్చదు. కాకపోతే సినిమా వేరు, నిజ జీవితం వేరు. నా జీవితంలో మాత్రం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నాపై నా భర్త చెయ్యిని పడనివ్వను’ అని తెలిపారు