మురుగదాస్‌ దర్శకత్వంలో ‘దర్బార్‌’ చిత్రంలో రజనీకాంత్‌

0
29

కోడంబాక్కం, న్యూస్‌టుడే: యువ హీరోలను మించి దూసుకుపోతున్నారు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ప్రస్తుతం ఆయన ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ‘దర్బార్‌’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నయనతార కథానాయిక. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ‘దర్బార్‌’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాన్నుట్లు ఇప్పటికే ప్రకటించారు. లైకా సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీని తర్వాత రజనీకాంత్‌ చిత్రానికి శివ దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. వరుసగా అజిత్‌తో చిత్రాలు తెరకెక్కించిన ఆయన.. ఇటీవల సూర్యతో త్వరలోనే ఓ సినిమాను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా చిత్రీకరణను జనవరి కల్లా పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఆ తర్వాత రజనీకాంత్‌ సినిమాను తెరకెక్కిస్తారని, అదే సంవత్సరం దీపావళికి విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.