అమెరికాలో విషాదం. తిమింగలాలకు కారుణ్య మరణం

0
120

అమెరికాలోని హవాయీ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక మౌవీ దీవిలోని షుగర్‌ బీచ్‌లో బలమైన అలల ధాటికి 10 తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చి బురదలో కూరుకుపోయాయి. ఎంతగా ప్రయత్నించినప్పటికీ తిరిగి సముద్రంలోకి చేరలేకపోయాయి. స్థానికులు గురువారం వాటిని గుర్తించి అధికారులకు సమాచారమిచ్చారు. అధికారులు వాటిలో ఆరింటిని తిరిగి సముద్రంలోకి చేర్చగలిగారు. మరో నాలుగు తిమింగలాల ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో తొలుత మత్తుమందు ఇచ్చి.. ఆపై వాటికి కారుణ్య మరణం ప్రసాదించారు. కోలుకునే పరిస్థితి ఏమాత్రం లేకపోవడంతో వేదన నుంచి విముక్తి కల్పించేందుకే తిమింగలాలకు కారుణ్య మరణం ప్రసాదించామని అధికారులు తెలిపారు.