‘నిశ్శబ్దం’లో అనుష్క

0
25

`బాహుబలి`, `భాగమతి` సినిమాల తర్వాత వెండితెరకు దూరమైన అనుష్క చాలా రోజుల తర్వాత నటించిన చిత్రం `నిశ్శబ్దం`. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అనుష్క మాటలు రాని పెయింటర్‌ సాక్షి పాత్రలో కనిపించబోతోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ విడుదలైంది. `ఆమె మాట్లాడలేదు.. కానీ, ఆమె కళ మాట్లాడుతుంది` అంటూ విడుదల చేసిన అనుష్క పోస్టర్ ఆకట్టుకుంటోంది. క్రేజీ హీరో మాధవన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇతర పాత్రల్లో మైకేల్ మాడ్సన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల తదితరులు నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.