ఇటీవల జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతగా నిలిచి మన భారతదేశానికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిన క్రీడాకారిణి పి.వి.సింధు. ఈ తెలుగు తేజం సాధించిన విజయంతో దేశం యావత్తు గర్వపడింది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆమెను అభినందించారు. తాజాగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ ఖరీదైన బి.ఎం.డబ్ల్యు కారుని సింధుకి హీరో అక్కినేని నాగార్జున చేతుల మీదుగా బహుకరించారు. ఈ సందర్భంగా.. అక్కినేని నాగార్జున మాట్లాడుతూ “సింధు ఆడిన బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్ చూశాను. ప్రత్యర్థిని ఆమె మట్టికరిపించింది. ఆమెను ఎన్ని రకాలుగా అప్రిషియేట్ చేసినా తక్కువే. సింధుని చూసి చాలా గర్వపడుతున్నాను. చాలా అద్భుతమైన విజయమది. ఈ విజయపరంపరను ఆమె ఇంకా కొనసాగించి మమ్మల్ని గర్వపడేలా చేయాలి. చాముండేశ్వరినాథ్ ఇప్పటి వరకు 22 కార్లను బహుమతిగా ఇచ్చారు. సింధుకి ఆయన గిఫ్ట్గా ఇస్తున్న నాలుగో కారు ఇది. సింధుకే కాదు.. దేశంలోని చాలా మంది అథ్లెట్స్ను గుర్తించి వారికి గైడెన్స్ ఇవ్వడంలో చాముండి ఎప్పుడూ ముందుంటారు“ అన్నారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -