మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న భారీ హిస్టారికల్ మూవీ `సైరా నరసింహారెడ్డి`. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. అక్టోబర్ 2న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ లెవల్లో ప్యాన్ ఇండియా మూవీగా సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను బుధవారం హైదరాబాద్లో విడుదల చేశారు. ట్రైలర్ విషయానికి వస్తే…`భారత్ మాత కీ జై …` అనే ఎమోషనల్ డైలాగ్ చిరంజీవితో స్వరంతో వస్తుంది. తర్వాత కొన్ని యాక్షన్ సీన్స్ వస్తాయి.నయనతార, తమన్నాలను చూడొచ్చు.నరసింహారెడ్డిని గొలుసులతో బంధించి బ్రిటీష్ పాలకులు తీసుకుని వస్తుండగా..`నరసింహారెడ్డి సామాన్యుడు కాడు.. అతను కారణజన్ముడు` అనే డైలాగ్ వస్తుంది.శివుడికి పూజ చేస్తున్న నరసింహారెడ్డిని చూపిస్తూ బ్యాగ్రౌండ్లో `అతనొక యోగి..అతనొక యోధుడు. అతన్నెవ్వరూ ఆపలేరు` అని హీరోయిజాన్ని ఎలివేట్ చేసే డైలాగ్ వస్తుంది.బ్రిటీష్వారితో పోరాడే యాక్షన్ పార్ట్ సీన్స్ వస్తాయి.ఈ భూమ్మీద పుట్టింది మేము.. ఈ మట్టిలో కలిసేది మేము మీకెందుకు కట్టాలిరా శిస్తు? అని బ్రిటీష్ అధికారిని నరసింహారెడ్డి ప్రశ్నిస్తాడు. అదే సందర్భంలో వచ్చే యాక్షన్ సన్నివేశాన్ని కూడా ట్రైలర్ చూపించారు.