వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్న వేణు మాధవ్ .

0
34

ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్రను వేసుకున్న వేణు మాధవ్‌ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల సమస్య తీవ్రం కావడంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు. కిడ్నీ సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని హాస్పిటల్‌ వైద్యులు తెలిపారు.

మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ నెల 6న సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చేరారు. గత కొద్ది రోజుల నుంచి ఆయనకు డయాలసిస్‌ నడుస్తోంది. మంగళవారం ఆరోగ్యం విషమించడంతో ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ నటులు జీవిత, రాజశేఖర్, ఉత్తేజ్‌లు ఆస్పత్రికి వచ్చి ఆయనను పరామర్శించి వెళ్లారు.