ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సత్యనారాయణ హత్య.

0
36

ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సత్యనారాయణ హత్యను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. హత్య చాలా దారుణమని, హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలాంటి పాత్రికేయుడిని హత్య చేయడం ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారు. సత్యనారాయణ కుటుంబసభ్యులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. హంతకులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు.

తూర్పుగోదావరి జిల్లాలోని తుని మండలం ఎస్‌. అన్నవరంలో ఈ దారుణ చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో నరికి పరారయ్యారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. తొండంగి అర్బన్ రిపోర్టర్‌గా సత్యనారాయణ పనిచేస్తున్నారు. మృతుడి కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. సత్యనారాయణ మృతిపట్ల రాజకీయ, జర్నలిస్టు సంఘాలకు చెందిన పలువురు సంతాపం తెలిపారు.