కీర్తిరెడ్డి కేసులో సంచలన నిజాలు.

0
25

హైదరాబాద్ హయాత్‌నగర్‌లో తల్లిని దారుణంగా హత్య చేసిన కన్న కూతురు కీర్తిరెడ్డి కేసులో సంచలన నిజాలు తెరపైకి వస్తున్నాయి. కీర్తి రెడ్డి ఇద్దరు ప్రియుడ్నులతో రిలేషన్ మెంటైన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే శశి పేరు కూడా బయటకు వచ్చింది. అయితే బాల్ రెడ్డి అనే మరో ప్రియుడిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. బాల్‌రెడ్డిని విచారించిన పోలీసులు అవాక్కయ్యే నిజాలు తెలిశాయి. కీర్తిపై బాలిరెడ్డి అత్యాచారం చేసినట్లు తేలింది. ఆ తర్వాత ఆమెకు అబార్షన్ కూడా చేయించాడని తెలిసింది. అయితే అబార్షన్ విషయంలో శశి కీర్తికి సహకరించాడన్న సమాచరం పోలీసులు తేల్చారు. దీంతో శశికి కీర్తి దగ్గరయ్యింది. ఆ పరిచయంతో కీర్తిని ఎలా అయిన సొంతం చేసుకోవాలన్న పథకంతో.. శశి కీర్తి తల్లి రజితకు ప్లాన్ వేశాడు. కూతురి చేత దగ్గరుండి తల్లిని హత్య చేయించాడు. శశి మాటలు విన్న కీర్తి చున్నీని తల్లి మెడకు బిగించి ఆమె ప్రాణాలు తీసింది. కూతురి ప్రవర్తనపై అనుమానం రావడంతో తండ్రి పోలీసుల్ని ఆశ్రయించాడు. దీంతో తీగ లాగితే డొంకంతా కదిలినట్లు… రజిత హత్య విషయంలో కీర్తితో పాటు.. ఇద్దరు ప్రియుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ముగ్గుర్ని వేరే వేరేగా విచారిస్తున్నారు.