ఆర్టీసీ మరో కీలక మలుపు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం.

0
27

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. తమ సంస్థలో ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఏపీఎస్‌ఆర్టీసీ పాలకమండలి సమ్మతించింది. ఈ మేరకు శుక్రవారం తీర్మానం చేసింది. అలాగే ఎలక్ట్రికల్ బస్సులను అద్దెకు తీసుకునేందుకూ ఆమోదం తెలిపింది. విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో శుక్రవారం ఆర్టీసీ పాలకమండలి సమావేశమైంది. ఈ సందర్భంగా మొత్తం 27 అంశాలను చర్చించి ఆమోదం తెలిపింది.

ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు క్యాబినెట్ ఆమోదం తెలపగా విధివిధానాలపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోంది. తాజాగా ఈ అంశంపై పాలకవర్గ సమావేశంలో చర్చించి, విలీనానికి సమ్మతమేనని తీర్మానించారు.