మెగా బ్రదర్స్ మళ్లీ జోరు . జగన్‌‌పై నాగబాబు ఫైర్…

0
35

 మెగా బ్రదర్స్ మళ్లీ జోరు పెంచారు. ప్రభుత్వమే టార్గెట్‌గా మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇప్పటికే… ఏపీలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై పోరాటంలో భాగంగా… జనసేన అధినేత పవన్ కళ్యాణ్… విశాఖలో ఆదివారం లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. దానికి మద్దతు ఇవ్వాలని ఇప్పటికే అన్ని విపక్షాలనూ కోరారు. ఇదే సమయంలో… మెగా బ్రదర్, జబర్దస్త్ కామెడీ షో జడ్జి నాగబాబు కూడా ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధకరమన్నారు. కష్టాల్లో ఉన్నవారికి చేయూత అందించేందుకే పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారన్న ఆయన… పవన్‌కు సామాజిక స్పృహ ఎక్కువన్నారు.

ఓదార్పు యాత్ర చేసిన నేత (సీఎం జగన్)కు భవన నిర్మాణ కార్మికుల బాధలు తెలియవా అని ప్రశ్నించిన నాగబాబు… ప్రభుత్వంపై గట్టిగా పోరాడతామన్నారు. ఎక్కడికక్కడ నిలదీస్తామన్నారు. చూస్తుంటే… నాగబాబులో మళ్లీ మునుపటి ఫైర్ కనిపిస్తోంది. ఎన్నికలప్పుడు ఎలాగైతే అప్పటి టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారో… ఇప్పుడు వైసీపీపైనా ఆయన అదే విధంగా వాయిస్ పెంచుతున్నారు.