గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త

0
26

గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ఇప్పటివరకు గుంటూరు-హైదరాబాద్ మధ్య నడిపిన ప్యాసింజర్ రైలును సూపర్ ఫాస్ట్ డెమో ప్యాసింజర్‌గా నడిపామని పేర్కొంది. ఇప్పుడు గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ఈ ప్యాసింజర్ రైలును ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్చుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా తెలిపారు. అదే విధంగా విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు వచ్చే సింహాద్రి ఎక్స్‌పె్‌సను నంద్యాల వరకు పొడిగించాలనే ఆలోచన ఉందని అన్నారు. అయితే నంద్యాల రైల్వే స్టేషన్‌లో నీటి వసతి కల్పిస్తే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరికొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళను నంద్యాల దాకా నడుపుతామని, కొన్ని నంద్యాల మీదుగా నడుపుతామని తెలిపారు.