ఎన్ కౌంటర్ పై రిపోర్ట్ ఇవ్వాల్సిందే.. పట్టుబట్టిన కేంద్రం..

0
45

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ అత్యాచారం కేసులో జరిగిన ఎన్కౌంటర్ పై కేంద్ర హోం శాఖ తెలంగాణా ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. ప్రస్తుతం ఈ కేసు పై దర్యాప్తు కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం ౩.౩౦ గంటల సమయంలో.. షాద్ నగర్ లోని చటాన్ పల్లిలో ఎన్కౌంటర్ జరిగింది. మూడు గంటలకు నిందితులు నలుగురిని తీసుకుని.. దిశ హత్య, అత్యాచారం జరిగిన ప్రదేశంలో పోలీస్ లు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయిస్తుండగా.. చటాన్ పల్లిలో పోలీస్ ల నుంచి తుపాకులు లాక్కునేందుకు ప్రయత్నిస్తూ… పోలీస్ ల పై దాడి చేసి తప్పించుకునెందుకు ప్రయత్నిస్తుండగా.. తాము కాల్పులు జరిపామని.. ఆ కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయారని పోలీస్ ల వాదన.