ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో కాంస్య పతక విజేత, అర్జున్ అవార్డు గ్రహీత, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు భమిడిపాటి సాయిప్రణీత్ వివాహం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఘనంగా జరిగింది. హైదరాబాద్కు చెందిన సాయి ప్రణీత్కు, కాకినాడకు చెందిన జయంతి శ్రీనివాస్ కుమార్తె లక్ష్మీశ్వేతకు కాకినాడలోని విద్యుత్ నగర్లోని వెంకన్నబాబు కళ్యాణ మండపంలో పెళ్లి జరిగింది.
సాత్విక్ సాయిరాజు సహా పలువురు బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఈ పెళ్లికి హాజరయ్యారు. సాయిప్రణీత్-శ్వేత జంటకు సోషల్ మీడియా ద్వారా వివిధ రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ చాంపియన్షిప్లో 36 ఏళ్ల తర్వాత పురుషుల సింగిల్స్లో కాంస్యం గెలిచిన భారత ప్లేయర్గా నిలిచాడు. కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న సాయిప్రణీత్ను ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ‘అర్జున అవార్డు’తో సత్కరించింది.