పాకిస్థాన్‌లో పెషావర్ హైకోర్టు సంచలన తీర్పు. పర్వేజ్ ముషారఫ్‌కు ఉరిశిక్ష

0
33

పాకిస్థాన్‌లో పెషావర్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు మరణశిక్ష విధించింది. ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. 2007లో ఎమర్జెన్సీకి సంబంధించి ముషారఫ్ తీసుకున్న నిర్ణయంపై పీఎంఎల్ పార్టీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆయన దేశద్రోహం చేశారని నిర్ధారిస్తూ ఉరిశిక్ష విధించింది. మూడేళ్ల క్రితం పాకిస్థాన్ వదిలి దుబాయ్ వెళ్లిన ముషారఫ్… ప్రస్తుతం అక్కడే తల దాచుకున్నారు. అయితే ఆయన ఆస్తులను జప్తు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. రెండు దశాబ్దాల క్రితం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న ముషారఫ్… సైనిక పాలన ద్వారా అధ్యక్ష పదవిని చేజిక్కించుకున్నారు.