మధ్యప్రదేశ్లో విషాద ఘటన చోటు చేసుకుంది.శుక్రవారం రాత్రి శిక్షణ విమానం కుప్పకూలి… ఇద్దరు పైలట్లు మృతిచెందారు. దట్టమైన పొగమంచుతో రన్ వే కపిపించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు చెబుతున్నారు. సాగర్ జిల్లా… ధనా వైమనిక కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతిచెందిన వారిలో శిక్షణ ఇస్తున్న అశోక్ మక్వానా అనే అధికారితో పాటు… ట్రైనీ పైలట్ పియూష్ చందేల్గా గుర్తించారు. అధికారులు ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా ధృవీకరించారు. ఇద్దరు మృతదేహాల్నిపోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన విమానం సెన్నా 172.. రాత్రిపూట ఈవిమానానికి ఎగిరే సౌకర్యాలు లేవని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ విమానాన్ని కమర్షియల్ ప్రైవేట్ లైసెన్స్, ప్రైవేట్ పైలట్ లైసెన్స్ కింద నడుపుతున్నారు. దీంతో ఈ విమానం ప్రమాదంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అధికారులు పరోక్షంగా చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై మధ్య ప్రదేశ్ సీఎం కమల్ నాథ్ స్పందించారు. మృతిచెందిన పైలట్ల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -