తిరుమల వెంకన్న స్వామి సేవలో పాల్గొన్న సరిలేరు నికేవ్వరు టీం..

0
27

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి విడుదలైన బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ సభ్యులు కలిసి శుక్రవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని మహేష్ బాబు దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. మహేష్ బాబు దంపతులతో పాటు నటి విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ దర్శకుడు అనిల్ రావిపూడి, మెహర్ రమేష్ నిర్మాతలు దిల్ రాజు, అనిల్ సుంకర,ఎన్వీ ప్రసాద్‌తో పాటు సరిలేరు నీకెవ్వరు టీమ్ సభ్యులు తిరుమల వెంకన్న స్వామి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికీ ఆశీర్వచనాలు అందజేశారు.

శ్రీవారి దర్శనం కోసం గురువారం రాత్రే సరిలేరు నీకెవ్వరు చిత్ర బృందం తిరుమల చేరుకున్న సంగతి తెలిసిందే. దర్శనాంతరం ఆలయ అధికారులు..మహేష్ బాబు దంపతులతో పాటు సరిలేరు నీకెవ్వరు టీమ్ సభ్యులకు స్వామి తీర్ధ ప్రసాదలు అందజేశారు. ఈ సంక్రాంతికి విడుదలైన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించిన నేపథ్యంలో టీమ్ సభ్యులు వారి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం విశేషం.