ఎన్టీఆర్‌ 24వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లో అమరజ్యోతి ర్యాలీ

0
30

నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 24వ వర్థంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ చేరుకొని నివాళులు అర్పించారు. ఆయన సమాధిపై పుష్ప గుచ్ఛాలను ఉంచి అన్న తమ్ములు తారక్, కళ్యాణ్ రామ్ తాత ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు. ఆయన సమాధిపై పుష్ప గుచ్ఛాలు ఉంచి, కొన్ని నిముషాలు మౌనం పాటించారు. అనంతరం కాసేపు అక్కడ గడిపారు. ఇక, దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు కూడా నివాళులు అర్పించారు. కాసేపు ఘాట్‌లోనే కూర్చొన్నారు. మరోవైపు ఇటు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించేందుకు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. తెలుగు వెండితెర వేలుపుగా, ప్రజల ఆరాధ్య నాయకుడిగా ఎదిగిన ఎన్టీఆర్ 1996 జనవరి 18న హఠాన్మరణం పొందారు.

ఇటు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించేందుకు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. తమ అభిమాన నటుడిని గుర్తు చేసుకుని నివాళులు అర్పిస్తున్నారు. ఇటు ఆయన వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు, టీడీపీ కార్యకర్తలు రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.మరోవైపు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లో ర్యాలీ ఏర్పాటు చేశారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని రసూల్‌పూర చౌరస్తా ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి ఎన్టీఆర్‌ ఘాట్‌ వరకు అమరజ్యోతి ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరవుతారని తెలుస్తోంది. టీడీపీ కార్యకర్తలు భారీగా తరలిరావాలని పార్టీ పిలుపునిచ్చింది.