లండన్ లోగుండెపోటుతో నిమ్స్ డాక్టర్ మృతి.

0
46

లండన్‌ సదస్సులో ప్రసంగిస్తూ గుండెపోటుకు గురైన నిమ్స్ డాక్టర్ మీనా కుమారి మృతి చెందారు. ఆమెను కాపాడటానికి లండన్ వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అత్యంత విషమ పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరిన మీనాకుమారిని కాపాడటానికి వైద్యులు చివరి నిమిషం వరకు ప్రయత్నించారని యూకే డిప్యూటి హై కమిషనర్‌ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్‌ వెల్లడించారు. ఆమె కుటుంబానికి, సన్నిహితులకు సంతాపాన్ని ప్రకటించారు. నిమ్స్ ఆస్పత్రి న్యూరో విభాగంలో సీనియర్ ఫిజీషియన్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ మీనాకుమారి అంతర్జాతీయ వైద్య సదస్సులో పాల్గొనడానికి ఇటీవల లండన్ వెళ్లారు. అక్కడ సదస్సులో ఉపన్యసిస్తుండగా ఆమె గుండెపోటుకు గురై కుప్పకూలారు. వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. మీనాకుమారి ఆరోగ్యం విషమించడంతో లండర్ వైద్యులు ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు.

మీనాకుమారికి గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స నిర్వహించి మూడు స్టెంట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. అయితే.. హార్ట్ ఫెయిల్యూర్ ప్రభావం మీనాకుమారి మెదడుపై తీవ్రంగా పడిందని.. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకున్నారని వెల్లడించారు. మీనాకుమారి మృతితో ఆమె కుటుంసభ్యులు, నిమ్స్‌ వైద్యులు, సిబ‍్బంది తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తమిళనాడుకు చెందిన మీనాకుమారి కుటుంబం ఎన్నో ఏళ్ల కిందటే భాగ్యనగరానికి వచ్చి స్థిరపడింది. గాంధీ ఆస్పత్రి నుంచి మీనాకుమారి ఎంబీబీఎస్, ఎండీ కోర్సులను పూర్తి చేశారు. నిమ్స్‌లో 25 ఏళ్లుగా సేవలందిస్తున్న ఆమె అంచెలంచెలుగా ఫ్రొఫెసర్‌ స్థాయికి ఎదిగారు.