సీనియర్ లాయర్‌పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్…

0
39

ఎలాంటి విషయాన్నైనా కుండ బద్దలుకొట్టి చెప్పే తత్వం బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ది. అందులోనూ ఆమెకు దేశభక్తి ఎక్కువ. దేశంలో జరిగే అన్యాయాలపై ఎప్పుడూ తనదైన శైలిలో పోరాడుతూ ఉంటారు. తోటి నటీనటులు తమ అభిప్రాయాలు వెల్లడించకపోయినా ఆమెకు అస్సలు నచ్చదు. అయితే.. నిర్భయ దోషులపై ఓ సీనియర్ లాయర్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కంగనా రనౌత్. నిర్భయ దోషులను క్షమించాలని కోరిన ప్రముఖ సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌పై బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అయితే సుప్రీంకోర్టుకు చెందిన సీనియర్ అడ్వొకేట్ ఇందిరా జైసింగ్ నిర్భయ దోషుల గురించి మాట్లాడుతూ.. నిర్భయ తల్లి వారిని క్షమించాలని అన్నారు. అంతటి హోదా ఉన్న లాయర్ ఇలాంటి షాకింగ్ వ్యాఖ్యలు చేయడంపై యావత్ భారతదేశం కంగుతింది. ఈ విషయంపై కంగనా రనౌత్ స్పందిస్తూ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అసలు నిర్భయను దారుణంగా రేప్ చేసి చంపిన రోజే దోషులను అక్కడికక్కడే కాల్చి చంపేయాల్సింది అని ఎప్పటినుంచో కంగన చెప్తూ వస్తున్నారు. మొత్తానికి వారిని ఉరి తీస్తున్నారని ఎంతో సంతోషించారు. అలాంటి సమయంలో ఇందిరా జైసింగ్ వారికి మద్దతుగా వ్యాఖ్యలు చేయడం కంగనకు ఏమాత్రం నచ్చలేదు. అలాంటి మహిళలను దోషులతో పాటు నాలుగు రోజుల పాటు జైళ్లో ఉంచాలి. కచ్చితంగా వారితో కలిసి ఉండేలా చేయాలి. అప్పుడే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. వీళ్లకు దోషులు, హంతకులపైన ప్రేమ, దయ, జాలి పుట్టుకువస్తాయి. ఇలాంటి వాళ్లే మృగాళ్లకు.. హంతకులకు జన్మనిస్తారు’’ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాగా ఏడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులను ఫిబ్రవరి 1 ఉదయం ఆరు గంటలకు ఉరి తీసేందుకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. నిర్భయ దోషులను తిహార్ జైల్లో ఉరివేసే బదులు నడిరోడ్డులో ఉరితీస్తే నేను చాలా సంతోషిస్తాను. అప్పుడు ఇలాంటి వక్ర బుద్ధి ఉండే మగవారిలో ఆడదానిపై చెయ్యి వేయాలన్న ఆలోచన వచ్చినా వెన్నులో వణుకుపడుతుంది. న్యాయస్థానం వేసే శిక్ష ఓ ఉదాహరణ అవ్వనప్పుడు ఆ శిక్ష వేయడం కూడా దండగే’ అని వెల్లడించారు.