వైసీపీ కార్యకర్తలకు రోజా హెచ్చరిక.

0
68

నగరి ఎమ్మెల్యే రోజా సొంత నియోజకవర్గంలో వాట్సాప్ ఆడియోలు కలకలం రేపుతున్నాయి. నగరికి చెందిన వైసీపీ నేత కేజే కుమార్, ఎమ్మెల్యే రోజా వర్గీయులు పోటాపోటీ ఆడియోలు విడుదల చేశారు. వైసీపీ నేత కేజే కుమార్ షష్ఠి పూర్తి కార్యక్రమానికి ఎవరూ వెళ్లొద్దని కార్యకర్తలకు రోజా ఆడియో సందేశం పంపినట్టు తెలుస్తోంది. ఇలాంటి కార్యక్రమాలకు వెళితే పార్టీ నుంచి దూరం పెడతామని ఆమె వైసీపీ కార్యకర్తలను హెచ్చరించినట్టు తెలుస్తోంది. కేజే కుమార్ తనను అన్ని విధాలా ఇబ్బంది పెడుతున్నారని రోజా మండిపడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

తన మంచితనాన్ని చేతగాని తనంగా చూస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజే కుమార్ షష్టి పూర్తి సందర్భంగా పలువురు నేతలు హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే అందులో నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తన ఫోటో లేకపోవడంపై రోజా సీరియస్ అయినట్టు తెలుస్తోంది.