నిర్భయ దోషుల ఉరి వాయిదాఫై RGV ఎమోషనల్ ట్వీట్.

0
32

నిర్భయ దోషుల ఉరిని మరోసారి వాయిదా వేయడంపై దేశవ్యాప్తంగా విమర్శల వెల్లువ కురుస్తుంది. ఉన్నట్లుండి ఉరిని వాయిదా వేయడంపై నిర్భయ తల్లి కూడా చాలా ఆవేదన పడింది. న్యాయవ్యవస్థలో ఉన్న లొసుగులను వాడుకుని ఇలా తప్పించుకోవడం ఎంతవరకు సబబు అంటూ ఆమె కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఈ విషయంలోపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఎప్పుడూ కాంట్రవర్సీ ట్వీట్స్ చేసే ఈయన.. ఇప్పుడు ఎమోషనల్ ట్వీట్ చేసాడు. నిర్భయ నిందితుల ఉరిని వాయిదా వేయడంతో ఈయన చాలా ట్వీట్స్ చేసాడు. అప్పుడు జంతువుల చేతిలో పడి నిర్భయ గ్యాంగ్ రేప్‌కు గురైతే.. ఇప్పుడు మన సిస్టమ్ చేతిలో గ్యాంగ్ రేప్‌కు గురవుతోందంటూ సంచలన ట్వీట్ చేసాడు వర్మ.
కనీసం ఈ సమయంలో ఒక్కసారి నిర్భయ తల్లిదండ్రుల ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోండి.. అది మీరు ఊహించగలరా మోదీ గారూ అంటూ ట్వీట్ చేసాడు. దానిని తెలుసుకోవడం కోసం.. నిర్భయను చంపేసిన నిందితులను శిక్షించేందుకు మన కోర్టులన్నీ ఎలా కింద మీదా పడుతున్నాయో చూడండి అంటూ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అందులో నిర్భయ తల్లి ఆవేదనతో పాటు ఉరి వాయిదాకు సంబంధించిన పోస్టులను కూడా ట్వీట్ చేసాడు వర్మ.