పవన్ అభిమానులకు చేదు వార్త.

0
41

పవన్ అభిమానులకు చేదువార్త. కృష్ణా జిల్లా మచిలీపట్నం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి లక్ష్మణ రావు హార్ట్ ఎటాక్‌తో కన్నుమూసాడు. కొన్ని రోజులుగా ఈయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే స్నేహితుడి మరణం తట్టుకోలేక ఈయన చనిపోయాడని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. దాసరి లక్ష్మణరావు ప్రాణ స్నేహితుడు సుధాకర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆయన మరణం లక్ష్మణ రావును కుంగదీసిందని చెబుతున్నారు ఫ్యామిలీ మెంబర్స్.
పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తే ప్రాణమిచ్చేంత అభిమానం ఈయన సొంతం. స్నేహితుడు చనిపోయిన తర్వాత కొన్ని రోజులుగా ముభావంగా ఉన్న ఈయనకు ఉన్నట్లుండి హార్ట్ ఎటాక్ వచ్చిందని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. వెంటనే ఆస్పత్రికి తరలించి.. వైద్య చికిత్స అందించినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఈయన మరణంపై పలువురు సంతాపం వ్యక్తం చేసారు. లక్ష్మణరావు మృతితో మచిలీపట్నంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంతేకాదు.. ఈయన అంతిమయాత్రలో ఏపీ మంత్రి పేర్ని నానితో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వచ్చి లక్ష్మణరావు పాడె మోసారు. జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు లక్ష్మణరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. పవన్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేసారు.