సీఎం జగన్‌ జైలుకు వెళ్ళటం కాయం అంటున్న నిమ్మగడ్డ ప్రసాద్.

0
85

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విధానాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీయబోతోందని రాజమహేంద్రవరం రూరల్‌ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. సెర్బియాలో నిర్బంధంలో ఉన్న పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ నోరు విప్పితే సీఎం జగన్‌ జైలుకు వెళ్తారని తెలిపారు. ఒకవేళ నోరు విప్పకపోతే ప్రసాద్‌ ఉరికంబం ఎక్కుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం బుచ్చయ్యచౌదరి విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవినీతిని అరికడతామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇటీవలే సెర్బియా వ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్యే బుచ్చయ్య ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు. అలాగే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం డోన్‌లో నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్‌ వ్యవహారంపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని గోరంట్ల డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్నీ ధరలను పెంచారని విమర్శించారు. పెట్రోలు ధరలు కూడా పెంచారన్నారు. ఇసుక మాఫియాతో వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.