స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వలేదని ఓ యువతి ఆత్మహత్య.

0
28

స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వలేదని కామారెడ్డి జిల్లాలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జిల్లాలోని దోమకొండలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఊరికి చెందిన కుకుట్ల మౌనిక(16) కామారెడ్డిలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. అయితే, వారం నుంచి ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను పట్టుబట్టింది. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు నడుస్తున్నందున అవి పూర్తయ్యాక కొనిస్తామని నచ్చజెప్పారు. అయినా వినకుండా తన పంతం కొనసాగించింది. అయితే, పరీక్షలు అయ్యాకే కొనిస్తామని స్పష్టం చేయడంతో మనస్తాపం చెందింది. ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తల్లిదండ్రులు గమనించి కామారెడ్డిలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

వైద్యుల సూచనతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. తండ్రి కుకుట్ల శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.